|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:29 PM
చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా కలిసి స్టెప్పులేస్తున్నారు. గచ్చిబౌలిలో వేసిన భారీ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.సినిమా చరిత్రలో చిరంజీవి, వెంకటేశ్ కలిసి డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్కు, 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారు. సెట్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం, వారి ఎనర్జీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Latest News