|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 03:22 PM
తమిళంలో హిట్ కొట్టిన మూడు సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి దిగిపోయాయి. ముందుగా 'డ్యూడ్' సినిమా ఓటీటీ సెంటర్ లో అడుగుపెట్టగా, ఇప్పుడు 'బైసన్' .. 'డీజిల్' సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హరీశ్ కల్యాణ్ హీరోగా నటించిన 'డీజిల్' అక్టోబర్ 17న థియేటర్లకు వచ్చింది. షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: ఈ కథ చెన్నై సముద్రతీరంలో మొదలవుతుంది. 1979లో ప్రభుత్వం సముద్రతీరం మీదుగా 17 కిలోమీటర్ల మేర ఒక పైప్ లైన్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ పైప్ లైన్ లో నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పైప్ లైన్ జాలరుల గ్రామాలకు .. సముద్ర తీరానికి మధ్య అడ్డుగా మారుతుంది. దాంతో జాలరులెవరూ సముద్రంలోకి చేపల వేటకి వెళ్లలేని పరిస్థితి వస్తుంది. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ సమస్యకి సంబంధించిన పోరాటంలోనే 'ఢిల్లీబాబు' చనిపోతాడు. అతని కొడుకు వాసుదేవ (హరీశ్ కల్యాణ్)ను మనోహర్ (సాయికుమార్) చేరదీస్తాడు. జాలరులు బ్రతకాలంటే క్రూడ్ ఆయిల్ ను దొంగిలించడమే మార్గమని మనోహర్ భావిస్తాడు. ఈ విషయంలో ముంబైలోని 'పఠాన్' (సచిన్ ఖేడేకర్) తో ఒప్పందం చేసుకుంటాడు. క్రూడ్ ఆయిల్ ను పెట్రోల్ గా .. డీజిల్ గా వేరు చేసే సొంత ఫ్యాక్టరీ పఠాన్ కి ఉంటుంది. అందువలన తమ గ్రామంలో దొంగిలించిన క్రూడ్ ఆయిల్ ను ముందుగా ముంబైకి తరలిస్తుంటారు. వచ్చిన డబ్బుతో గూడెం ప్రజలను ఆదుకుంటూ ఉంటారు. ఈ విషయంలో వాసుదేవ కీలకమైన పాత్రను పోషిస్తూ ఉండటం వలన, అందరూ అతనిని 'డీజిల్' అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే అక్రమంగా జరిగే ఈ బిజినెస్, పఠాన్ దురాశ కారణంగా చిక్కుల్లో పడుతుంది. అతను ప్రవేశపెట్టిన బాలమురుగన్ (వివేక్ ప్రసన్న) డీసీపీ మాయవేల్ (వినయ్ రాయ్) మాదకరంగా మారతారు. అలాంటి పరిస్థితులలో తన గూడెం ప్రజలను కాపాడుకోవడం కోసం డిజీల్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేది కథ.
Latest News