|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 04:55 PM
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవల మంతెన రామరాజు కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. భారత సంతతి అమెరికన్ బిలియనీర్ అయిన రామరాజు.. అమెరికా ఫార్మా ఇండస్ట్రీలో పేరొందిన వ్యాపారవేత్త. ఆయన కుమార్తె నేత్ర మంతెన, వంశీ గాదిరాజు వివాహానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో భాగంగా పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.ఈ వేడుకల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన ఇచ్చారు. అయితే, ఈ ఒక్క ప్రదర్శనకు జెన్నిఫర్ లోపేజ్ ఏకంగా రూ.17 కోట్లు అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఉదయ్ పూర్ లో జరిగిన పలు వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ పాల్గొన్నారు. 2015లో జరిగిన సంజయ్ హిందూజా పెళ్లికి జెన్నిఫర్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చినందుకు గానూ జెన్నిఫర్ 6.5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని సమాచారం.
Latest News