|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 03:07 PM
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అనంతరం ఆయన్ను అంబులెన్సులో ఇంటికి తీసుకొచ్చారు. ధర్మేంద్ర ఐకానిక్ మూవీ 'షోలే'లో వీరూ పాత్రతో ఆయన ఎంతో పేరు సంపాదించారు. ధర్మేంద్ర 'దోస్త్', 'డ్రీమ్ గర్ల్', 'ఘాయల్', 'మేరా నామ్ జోకర్' వంటి చిత్రాల్లో నటించారు. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు, సినీ అభిమానులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన నివాసానికి చేరుకున్నారు.
Latest News