|
|
by Suryaa Desk | Sun, Nov 23, 2025, 03:45 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం 'స్పిరిట్' లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై, ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. హైదరాబాద్లో ఆదివారం ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాతలు భూషణ్ కుమార్, వంగా ప్రణయ్, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, వంగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు
Latest News