|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 04:33 PM
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తాను కీలక పాత్రలో నటించిన 'కాంత' సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల భాగ్యశ్రీ తన సోషల్ మీడియా పోస్ట్లో రానాను నిజమైన స్నేహితుడని, తన మెంటార్ అని అభివర్ణించింది. ఈ పోస్ట్పై రానా స్పందిస్తూ భాగ్యశ్రీ అంకితభావాన్ని, వృత్తిపట్ల ఆమెకున్న నిజాయతీని కొనియాడాడు.ఈ విషయంపై రానా మాట్లాడుతూ "భాగ్యశ్రీ అలా చెప్పడం ఆమె మంచితనం. ఆమె చాలా సిన్సియర్. ఈ సినిమా కోసం బాంబే నుంచి వచ్చిన ఆమె, తమిళం నేర్చుకోవాలని మేము చెప్పగానే ఏకంగా ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి భాష నేర్చుకుంది. ఈ రోజుల్లో ఇంతటి అంకితభావం చూడటం చాలా అరుదు. ఆమె నిజాయతీ అసాధారణం" అని పేర్కొన్నాడు."ప్రారంభంలో మేము కొంచెం కంగారుపడ్డాం. దుల్కర్ సల్మాన్, సముద్రఖని వంటి గొప్ప నటులతో సరిపోయే కొత్త అమ్మాయి కావాలని అనుకున్నాం. కానీ ఆమె నటిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే, టెస్ట్ షూట్ ప్రారంభమైన కొద్ది రోజులకే మా 'కుమారి' పాత్రకు సరైన నటి దొరికిందని మాకు అర్థమైంది" అని రానా వివరించాడు.
Latest News