|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 04:05 PM
ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్ను ఖరారు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను చూసిన మొదటి తెలుగు సినిమా మహేశ్ ‘పోకిరి’. 'వారణాసి' కథకు, అందులోని పాత్రకు మహేశ్ బాబు అర్హుడు. రాజమౌళి గారు ఈ సినిమాలోని నా పాత్ర గురించి ఐదు నిమిషాలు చెప్పగానే వెంటనే అంగీకరించాను. ఆయన కథ చెప్పిన విధానానికి ఫిదా అయ్యాను. ఈ చిత్రంలో నా 'కుంభ' పాత్ర శారీరకంగా, మానసికంగా నాకు ఒక పెద్ద సవాల్గా నిలిచింది. షూటింగ్లో నేను నిజంగా టార్చర్ అనుభవించాను’’ అని నవ్వుతూ అన్నారు.
Latest News