|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 03:42 PM
తమిళ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రం 'కరుప్పు' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రానికి ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవలే తమిళ మరియు తెలుగు రెండింటిలోనూ టీజర్ను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సూర్య న్యాయవాది పాత్రను పోషిస్తాడు మరియు గ్రామ రూపంలో కూడా కనిపిస్తాడు. త్రిష కృష్ణన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇంద్రన్స్, నాటి, స్వసికా, శ్షివాడ మరియు ఇతరులు కీలక పాత్రల్లో ఉన్నారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ కింద ఎస్. ఆర్. ప్రకాష్ బాబు మరియు ఎస్. ఆర్. ప్రభు నిర్మించారు.
Latest News