|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 07:41 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో తన 'SSMB29' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు నటుడి యొక్క చిత్రం రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వాస్తవానికి 2005 లో విడుదలైన మహేష్ బాబు యొక్క 'అతడు' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. విడుదలైన 20 సంవత్సరాల తరువాత మల్లి ఈ చిత్రం తెలుగు వెండితెరపైకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్గా రెండు తెలుగురాష్ట్రాలలో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా రీ రిలీజ్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఐమాక్స్ ఫార్మాట్లో తిరిగి విడుదల చేసిన మొదటి భారతీయ సినిమాగా ఈ చిత్రం భారతీయ సినిమాలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రంలో సాంకేతికంగా 4K అల్ట్రా హెచ్డి రిజల్యూషన్ మరియు డాల్బీ ఆడియో మాస్టరింగ్ ఉంటాయి. మని శర్మ చార్ట్బస్టర్ ఆడియో ఆల్బమ్ను కంపోజ్ చేసారు. త్రిషా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి త్రివికమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాజర్, బ్రహ్మానందం, సుధా, హేమ, బ్రహ్మాజీ, సోను సూద్, ప్రకాష్ రాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు-ఫిల్మేకర్ మురలి మోహన్ జయభేరి బ్యానర్ పై నిర్మించారు.
Latest News