|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 06:35 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో విడుదల కానున్న 'కూలీ' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభిస్తుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ శృతి హస్సన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రముఖ బ్యానర్ హంసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్లు USAలో ఒక సంచలనాత్మక నోట్లో ప్రారంభమయ్యాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ ప్రీ సేల్స్ 600 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ ఇండియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు 14, 2025న పెద్ద స్క్రీన్లను తాకనుంది.
Latest News