|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 06:22 PM
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తునట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా పై భారీ హైప్ ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి సింగిల్ త్వరలో విడుదల కానుంది. తమన్ కంపోస్ చేసిన మొదటి సింగిల్ కి తమిళ స్టార్ సింబు తన గాత్రాన్ని అందించారు. ఈ ట్రాక్ ఆగస్టు 1, 2025న విడుదల కానుంది. ఉత్సాహాన్ని పెంచుతూ, తమన్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో కూడా అదే వెల్లడించారు. ఈ వారాంతంలో అధికారిక ప్రకటన రానున్నట్లు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Latest News