|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 08:16 AM
కోలీవుడ్ యువ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే డ్రాగన్తో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న తరువాత నటుడు ప్రస్తుతం తెలుగు తమిళ ద్విభాషా చిత్రానికి పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి మేకర్స్ 'డ్యూడ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్-లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేయగా సానుకూల స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రదీప్ రంగనాథన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా సెట్స్ లో సెలెబ్రేట్ చేసారు. ఈ సెలెబ్రేషన్స్ కి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. యువ దర్శకుడు కీర్తిస్వారాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని మైథ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్రింద నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్-ఇండియా విడుదల కానుంది. సీనియర్ నటులు శరత్ కుమార్, రోహిని మొల్లెటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో దీపావళి 2025 సందర్భంగా విడుదల కానుంది. సాయి అభాంక్కర్ ఈ చిత్ర సంగీత స్వరకర్తగ ఉన్నారు.
Latest News