|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 04:10 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో విడుదల కానున్న 'కూలీ' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభిస్తుంది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రముఖ బ్యానర్ హంసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ ప్రీ సేల్స్ 450 షోస్ నుండి $300K వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ శృతి హస్సన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు 14, 2025న పెద్ద స్క్రీన్లను తాకనుంది.
Latest News