|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 08:07 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా పాన్-ఇండియా హిట్ "హనుమాన్" తో భారీ విజయాన్ని అందుకున్నాడు. తన రాబోయే పాన్-ఇండియా చిత్రం "మిరాయ్"తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్సె కి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యాక్షన్ సినిమా ఔత్సాహికులు మరియు సాధారణ వీక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని వైబ్ ఉంది అనే టైటిల్ తో విడుదల చేసారు. గౌరహరి కంపోస్ చేసిన ఈ సాంగ్ కి కే కే లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ తన గాత్రాన్ని అందించారు. ఫుల్ సాంగ్ ని మేకర్స్ జులై 26న ఉదయం 10:08 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంకి కార్తీక్ ఘట్టమ్నేని సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్ప్లే రెండింటినీ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు."మిరాయ్" సెప్టెంబర్ 5, 2025న 8 భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రం 2D మరియు 3D ఫార్మాట్లలో సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.
Latest News