|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 05:31 PM
నటుడి నుండి దర్శకుడిగా మారిన RJ బాలాజీతో కోలీవుడ్ స్టార్ సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'కరుప్పు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాని 2025 దివాళీకి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి భారీ స్పందన లభించింది. ఈ సినిమాలో త్రిష మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇంద్రన్స్, నాటి, స్వసికా, శ్షివాడ మరియు ఇతరులు కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News