|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 03:04 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి రాబోయే తెలుగు చిత్రం 'సర్ మేడమ్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం జూలై 25న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో నిత్య మీనన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం తమిళ చిత్రం యొక్క డబ్ వెర్షన్. ఈ చిత్రంలో విజయ్ మరియు నిత్య భార్యాభర్తలు నటించారు. మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటెర్టైన్మ్నెట్ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. పండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. యోగి బాబు మరియు చెంబాన్ వినోద్ జోస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
Latest News