|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 04:36 PM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వార్ 2' అత్యంత ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామాలలో ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14, 2025న గొప్ప థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో ఆల్ఫా గర్ల్స్ అయ్యిన అలియా భట్ మరియు శార్వరి నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ విషయాని అధికారికంగా ప్రకటించనుంది. కియారా అద్వానీ వార్ 2 లో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. వార్ 2 అనేది హ్రితిక్ రోషన్ యొక్క 2019 స్పై థ్రిల్లర్, వార్ యొక్క సీక్వెల్. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రం YRF స్పైవర్స్లో భాగం. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News