|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 04:18 PM
బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు జాన్వీ కపూర్ ఒక సంతోషకరమైన కామెడీ ఎంటర్టైనర్ 'పరమ సుందరి' లో నటిస్తున్నారు. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నార్త్ ఇండియాకు చెందిన ఓ యువకుడు సౌత్ ఇండియన్ అమ్మాయితో ప్రేమలో పడటం మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. రెండు విభిన్న ప్రపంచాలు కలిసినప్పుడు వికసించే ప్రేమ కథను పరమ సుందరి చెబుతుంది. ముందు ఈ చిత్రం జూలై 25, 2025న థియేట్రికల్ విడుదల కోసం సిద్ధంగా ఉంది కానీ కొన్ని కారణాల వాళ్ళ మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగష్టు 29కి లేదా సెప్టెంబర్ 5కి వాయిదా వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. రానున్న రోజులలో మేకర్స్ విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వనున్నారు. మద్దోక్ ఫిలింస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News