![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 07:43 PM
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరధా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క థీమ్ సాంగ్ ని యాత్ర నార్యస్తు అనే టైటిల్ తో జులై 17న ఉదయం 11 గంటలకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఉదయం 11 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు అంతేకాకుండా ఈ ఈవెంట్ కి ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మరియు సత్య దేవ్ ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. తెలుగు, మలయాళం రెండు భాషల్లోనూ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ ఉత్తేజకరమైన చిత్రంలో అనుపమతో కలిసి దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ మరియు రాగ్ మయూర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసులు పి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు.
Latest News