|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 05:43 PM
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హంక్ హ్రితిక్ రోషన్ తో కలిసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై థ్రిల్లర్ 'వార్ 2' లో స్క్రీన్ను పంచుకోనున్నారు. ఈ హై-బడ్జెట్ ఎంటర్టైనర్లో కియారా అద్వానీ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసిన వార్ 2 టీజర్ మూవీ పై భారీ హైప్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని వచ్చే వారంలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ 3 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు లేటెస్ట్ టాక్. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది. వార్ 2 అనేది హ్రితిక్ రోషన్ యొక్క 2019 స్పై థ్రిల్లర్ వార్ యొక్క సీక్వెల్. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రం YRF స్పైవర్స్లో భాగం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ ట్రీట్గా థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News