|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 04:11 PM
స్టార్ హీరోయిన్ రష్మిక మాండన్న రాబోయే యాక్షన్-ప్యాక్డ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ హీరోయిన్-ఆధారిత చిత్రానికి రావింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మేకర్స్ 'మైసా' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క పూజ కార్యక్రమాన్ని మేకర్స్ రేపు ఉదయం 11 గంటలకి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. వివిధ చలన చిత్ర పరిశ్రమలకు చెందిన రష్మిక మాండన్న ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. కీ టెక్నికల్ సిబ్బంది గురించిన వివరాలు వచ్చే వారం వెల్లడి కానున్నాయి. అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, సాయి గోపా సహ నిర్మాతగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News