|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 06:12 PM
టాలీవుడ్ యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ తదుపరి రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకుడిగా పరిచయం అవుతోంది. గార్జియస్ బ్యూటీస్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలు మరియు భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 17, 2025న దీపావళి స్పెషల్గా విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని జులై 28న మల్లికా గంధ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. షూటింగ్ కొనసాగుతుండగా, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ అంచనాల చిత్రం యొక్క అప్డేట్లు మరియు స్నీక్ పీక్ల కోసం ఎదురుచూస్తున్నారు. వైవా హర్ష ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. చార్ట్-టాపింగ్ మ్యూజిక్కి పేరుగాంచిన థమన్ ఎస్ సౌండ్ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా జ్ఞాన శేఖర్ బాబా, ఎడిటర్ గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా మరియు కాస్ట్యూమ్ డిజైనర్ గా శీతల్ శర్మ ఉన్నారు.
Latest News