|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 03:58 PM
గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'కింగ్డమ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభిస్తుంది. ఈ కథ పునర్జన్మ ఇతివృత్తాన్ని సూచిస్తుంది. తాజాగా ఇప్పుడు నటి భాగ్య శ్రీ బోర్స్ ఈ చిత్రానికి తన డబ్బింగ్ ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు నటి సోషల్ మీడియాలో డబ్బింగ్ స్టూడియో లో ఉన్నసి చిత్రాన్ని పోస్ట్ చేసింది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్గా కనిపించనున్నారు. గౌతమ్ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం జులై 31, 2025న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Latest News