|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 03:20 PM
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అభిమానులు ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క లాస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించినట్లు మేకర్స్ సెట్స్ నుండి ఒక BTS పిక్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో చిత్ర బృందం ఆచార్య గణేష్ కోరియోగ్రఫీ చేసిన ఒక సాంగ్ ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Latest News