|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 03:59 PM
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' జూలై 24, 2025న బహుళ భాషలలో గొప్ప థియేట్రికల్ విడుదల కోసం సిద్ధమవుతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, మరియు నిధి అగర్వాల్ శక్తివంతమైన ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభించింది. ఈ సినిమా యొక్క నైజాం రైట్స్ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ LLP బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ఉన్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మెగా సూర్య నిర్మాణంలో దయాకర్ రావు నిర్మించి, ఎం రత్నం సమర్పించిన ఈ చిత్రంలో M M కీరావాని స్వరపరిచిన సంగీతాన్ని కలిగి ఉంది.
Latest News