|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 08:59 PM
నటుడి నుండి దర్శకుడిగా మారిన RJ బాలాజీతో కోలీవుడ్ స్టార్ సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'కరుప్పు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క టీజర్ ని రేపు ఉదయం 10 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో త్రిష మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News