|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 04:00 PM
హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ప్రముఖ నటి రాశి ఖన్నా ఆన్ బోర్డులో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం నటి యొక్క స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటి శ్లోక అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్లు ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Latest News