![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 04:09 PM
కన్నడనటి రన్యారావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా బంగారం తరలిస్తు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన కేసులో తాజాగా ఆమెకు ఏడాది పాటు జైలుశిక్ష ఖరారైంది.ఈ కేసుపై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు రన్యారావు, ఆమె సహచరుడు తరుణ్తో కలిసి దుబాయ్కు చెందిన వజ్రాల కంపెనీని స్థాపించారని, దానిని వారు భారతదేశంలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ఒక సంస్థగా ఉపయోగించారని తేలింది. రన్యా తన VIP హోదాను దుర్వినియోగం చేసి భద్రతా తనిఖీలను దాటవేసిందని, ఎయిర్పోర్టులో తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఆమె పిన తండ్రి, IPS అధికారిని ఉపయోగించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఆమెకు ఏడాది పాటు జైలు విక్షను విధించింది. రన్యారావుతో పాటు ఆమె భాగస్వామి తరుణ్, మరో వ్యక్తి సాహిల్కు కూడా ఇదే శిక్ష శిక్షను ఖరారు చేసినట్టు బోర్డు తెలిపింది.ఈ కేసులో ఆమెను దోషిగా నిర్ధారించేందుకు బలమైన సాక్షాలు ఉన్నాయని.. ఈ క్రమంలో శిక్షా కాలంలో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కూడా లేకపోవచ్చని స్పష్టం చేసింది. 2024 మార్చి 3వ తేదీన దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో రన్యారావు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు..
Latest News