![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 05:32 PM
నిరంజన్ మరియు ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న "సీతా పయనం"అనే చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో ప్రాథమికంగా చిత్రీకరించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు ఫస్ట్ సింగల్ మూవీ పై భారీ ప్రభావాన్ని చూపింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ఏ ఊరికెళ్తావ్ పిల్ల వీడియో రిలీజ్ వీడియోని మేకర్స్ విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సత్య రాజ్, ప్రకాష్ రాజ్, ధృవ్ సర్జ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా మ్యాన్ గా బలమురుగన్, ఎడిటర్ గా అయూబ్ ఖాన్, రైటర్ గా సాయి మాధవ్, చంద్ర బోస్ ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ సర్జా తన శ్రీ రామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Latest News