![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 02:46 PM
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాద్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన నుండి మూవీ పై భారీ బజ్ ఉంది. ఈ చిత్రానికి 'బిక్షామ్ దేహి' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల మేకర్స్ హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. తాజాగా ఇప్పుడుద్ ఈ సినిమా షూటింగ్ కోసం ప్రముఖ నటి టబు హైదరాబాద్ కి చేరుకుంది. ఈ సినిమాలో సంయుక్త మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో టబు, దునియా విజయ్, మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలతో సహా పలు భాషలలో విడుదల అవుతుంది. ఈ చిత్ర సంగీతాన్ని మెలోడీ బ్రహ్మ మణి శర్మ కుమారుడు మహతి స్వర సాగర్ స్వరపరుస్తున్నారు. ఈ చిత్రాన్ని చార్మ్మే కౌర్ మరియు పూరి జగన్నాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Latest News