![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 07:31 AM
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'కూలీ' ఆగష్టు 14, 2025న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. ప్రశంసలు అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం యాక్షన్, సస్పెన్స్ మరియు ఆకట్టుకునే కథాంశంతో కూడిన థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ను సృష్టించింది. తాజాగా ఇప్పుడు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ఆగస్టు 2, 2025న విడుదల కానుంది అని లోకేష్ ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించారు. కూలీ అనేది స్వతంత్ర ప్రాజెక్ట్ మరియు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సియు) కు సంబంధించినది కాదు. ఇటీవలే విడుదల చేసిన సాంగ్స్ కి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు.
Latest News