![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 10:19 AM
నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో 23 ఎజెండాలతో ప్రవేశపెట్టిన రూ. 139. 29కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మేయర్ మాట్లాడుతూ.. వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో నిధుల మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, డిప్యూటీ మేయర్ రిజ్వాన మసూద్ షమీం పాల్గొన్నారు.