|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 12:34 PM
రాఖీ పండగ సందర్భంగా HYDలో సందడి మొదలైంది. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున అక్కాచెల్లెళ్లు బయల్దేరారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ ‘రాఖీ స్పెషల్’ పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు అందిస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి బస్సుల్లో ముందే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ పడుతున్నారు.