|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:10 PM
సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్యలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఏవో ఆంథోనీకి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్ నేతృత్వంలో వినతి పత్రం సమర్పించారు. మహిళా సమాఖ్య అక్రమాలకు నిలయంగా మారిందని, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే అవినీతి బయటపడుతుందని మాణిక్ తెలిపారు.