![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 06:17 AM
కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది ఆసుపత్రిలో చేరగా, వారి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు ఈరోజు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎంవీఎస్ సుబ్బలక్ష్మి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విషమంగా ఉన్నవారిలో మోనప్ప అనే వ్యక్తికి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, దేవదాస్ అనే బాధితుడికి ఇదివరకే డయాలసిస్ చేస్తుండగా, కృష్ణయ్య అనే మరో బాధితుడికి కూడా డయాలసిస్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె వివరించారు.మిగిలిన 17 మంది బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్ సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. వారందరినీ వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.