|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:56 PM
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ విభాగాల పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లనింటినీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై శుక్రవారం సీఎస్ జీవో జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఏయే విభాగాల పరిధిలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి, వాటన్నింటినీ హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేయాలని జిల్లాల కలెక్టర్ల ను సీఎస్ ఆదేశించారు.గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ ను ఆర్ అండ్ బీలో విలీనం చేసింది. దీంతో జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతలను పంచాయతీ రాజ్, ఆర్ అండ్బీలకు ప్రభుత్వం ఆప్పగించింది. ఇప్పుడు ఆ ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేయాలని సీఎస్ ఆదేశించారు.