|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:30 PM
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని పాపయ్యపల్లి స్ఫూర్తి యూత్ క్రీడాకారులకు బెజ్జంకి బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ జెర్సీలను పంపిణీ చేశారు. కల్లెపెల్లిలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఈ పంపిణీ జరిగింది. యువత క్రీడల్లో రాణించాలని, తద్వారా వారిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెరుగుతాయని, బెజ్జంకి యువత క్రీడల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే సదుద్దేశంతో టీ షర్ట్లు పంపిణీ చేశానని దొడ్ల ప్రశాంత్ తెలిపారు..