|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:31 AM
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం కేసి తండాలో ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ గల్లంతైన జాటవత్ రిషి (6), బద్రీనాథ్ (8) అనే ఇద్దరు బాలురు స్థానిక చెరువులో మునిగి మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో రెస్క్యూ టీం రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టింది. అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డలు విగతజీవులుగా మారడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.