|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 12:30 PM
సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డిలు సిద్దిపేట పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడిన పథకాలపై 'బాకీ కార్డు'లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మంజుల రాజనర్సు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలకు బాకీపడ్డ నిధులను ఇచ్చాకే ఓట్లు అడగాలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల్లోనూ బకాయిపడిందని ఆమె వివరించారు.