|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:26 PM
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకులల్లో పెరుగుతున్న వేళ... నిర్మాత మిక్కిలినేని సుధాకర్ స్పష్టమైన అప్డేట్ ఇచ్చారు.ఒక ప్రైవేట్ ఈవెంట్లో సుధాకర్ మాట్లాడుతూ... "దేవర 2 షూటింగ్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభమవుతుంది. అలాగే ఈ సినిమాను 2027లో థియేటర్లలో విడుదల చేస్తాం" అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో సంతోషాన్ని నింపాయి. గత కొన్ని నెలలుగా 'దేవర 2'పై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో, సీక్వెల్ రద్దు అవుతుందేమో అనే డౌట్స్ నెలకొన్నాయి. కానీ ఇప్పుడు నిర్మాత చేసిన ప్రకటనతో అనుమానాలు తొలగిపోయాయి.
Latest News