|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:33 PM
కన్నడ నటుడు దర్శన్ భాగస్వామి, రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలైన పవిత్ర గౌడకు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో ఆమెకు ఇంటి భోజనం అందించేందుకు కింది కోర్టు ఇచ్చిన అనుమతిని హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. పవిత్రతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మణ్, నాగరాజ్లకు కూడా ఈ సౌకర్యాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. గతంలో కింది కోర్టు వారానికి ఒకసారి ఇంటి భోజనం తెప్పించుకునేందుకు పవిత్ర గౌడకు అనుమతి ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ప్రాసిక్యూషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జైల్లోని నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. చట్టం ముందు అందరూ సమానులేనని, హోదా, పలుకుబడితో సంబంధం లేకుండా నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Latest News