|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:38 PM
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన కొత్త స్పై థ్రిల్లర్ 'ధురంధర్' భారత్లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నప్పటికీ, అంతర్జాతీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్కు వ్యతిరేకమైన సందేశం ఉందన్న కారణంతో ఆరు గల్ఫ్ దేశాలు ఈ సినిమాను నిషేధించాయి. దీంతో కీలకమైన మిడిల్ ఈస్ట్ మార్కెట్లో సినిమా విడుదల నిలిచిపోయింది.బాలీవుడ్ చిత్రాలకు గల్ఫ్ ప్రాంతం ఒక ముఖ్యమైన మార్కెట్. అక్కడ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నించింది. కానీ, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ దేశాల అధికారులు సినిమా థీమ్కు అభ్యంతరం తెలుపుతూ విడుదలకు అనుమతి నిరాకరించారు. "ఇది పాకిస్థాన్ వ్యతిరేక చిత్రం కావడంతో ఇలా జరుగుతుందని ముందే ఊహించాం. అయినా చిత్ర బృందం ప్రయత్నించింది, కానీ ఏ దేశం కూడా సినిమా కథాంశాన్ని అంగీకరించలేదు" అని ఆ సినిమా వర్గాలు పేర్కొన్నాయి. గల్ఫ్ దేశాలలో గతంలో 'ఫైటర్', 'టైగర్ 3', 'ఆర్టికల్ 370', 'ది కశ్మీర్ ఫైల్స్' వంటి చిత్రాలు కూడా ఇలాంటి నిషేధాలనే ఎదుర్కొన్నాయి. 'ఫైటర్' చిత్రాన్ని యూఏఈలో మొదట విడుదల చేసినా, ఒక్క రోజులోనే థియేటర్ల నుంచి తొలగించడం గమనార్హం.
Latest News