|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:08 PM
టాలీవుడ్ యువ నటుడు నితిన్ రాబోయే ఎమోషనల్ యాక్షన్ డ్రామా చిత్రం 'తమ్ముడు' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జూలై 4, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 15 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. సప్తమి గౌడ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లయా, లబ్బర్ పాంధు ఫేమ్ స్వాసికా, వర్ష బొల్లమ్మ, మరియు సౌరాబ్ సచదేవా సహాయక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు మరియు షిరిష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు.
Latest News