|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 11:58 AM
విజయ్ దేవరకొండ హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్పై 'జటాయు' అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కే ప్రణాళికలు చాలాకాలం క్రితమే సిద్ధమయ్యాయి కానీ జరగలేదు. ఆ తర్వాత ప్రభాస్తో ఈ సినిమా చేయాలనే వార్తలు వచ్చిన అవి నిజం కాలేదు. తాజాగా ఈ సినిమాకు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ అంతగా లేని రోషన్తో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Latest News