|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 11:59 AM
తమిళనాడులోని కరూర్లో నెల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలను నటుడు విజయ్ పరామర్శించారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో జరిగిన ఈ సమావేశంలో 41 మంది మృతుల కుటుంబాలకు చెందిన 37 కుటుంబాలతో పాటు సుమారు 200 మంది హాజరయ్యారు. ఈ మీటింగ్లో ఇతరులకు ప్రవేశం ఇవ్వలేదు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, సాయం అందించే దిశగా విజయ్ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Latest News