|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:05 PM
హనుమాన్ యొక్క అద్భుత విజయం తరువాత చిత్రనిర్మాత ప్రశాంత్ వర్మ తన సినీ విశ్వాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. ఈ సూపర్ హీరో చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. హను-మాన్ యొక్క భారీ విజయాన్ని అనుసరించి అందరి దృష్టి చిత్రం యొక్క సీక్వెల్ 'జై హను-మాన్' పైనే ఉంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేయబడింది మరియు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు, ప్రధాన తారాగణం గురించి వివరాలు ప్రకటించబడలేదు. మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడిగా పురాణ పాత్రను పోషించబోతున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి సంబందించిన స్పెషల్ వీడియోని నటుడు రిషబ్ శెట్టి పుట్టినరోజున అంటే జులై 7న విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేసితున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతోంది త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి బృందం సన్నద్ధమవుతోంది. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News