|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 08:24 AM
రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన 'జూనియర్' ఒక యూత్ ప్రేమకథ. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కిరీటి మరియు శ్రీలీల నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం జూలై 18, 2025న గొప్ప థియేట్రికల్ విడుదల కోసం సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క టీజర్ ఇటీవలే విడుదల కాగా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని వైరల్ వయ్యారి అనే టైటిల్ తో జులై 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కన్నడ మరియు తెలుగులో విడుదల కానుంది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక వారాహి చలానా చిత్రం బ్యానర్ ఆధ్వర్యంలో రజనీ కొర్రాపతి నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్, వైవా హర్ష మరియు జెనీలియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Latest News