![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:10 PM
కోలీవుడ్ నటుడు ధనుష్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ట్రాన్స్ అఫ్ కుబేర ని రేపు అంటే మే 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ వీడియో విడుదలకి అన్ని సిద్ధంగా ఉన్నట్లు ప్రింట్ కూడా లాక్ అయ్యినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News