![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 10:35 AM
ప్రస్తుతం మంచు మనోజ్ భైరవం మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ కన్నప్ప టీంకు క్షమాపణలు చెప్పారు. తనను విష్ణు వ్యక్తిగతంగా బాధపెట్టాలని చూశాడని, తనకు, తన భార్యకు సంబంధించిన చాలా ఆస్తులను, జ్ఞాపకాలను విష్ణు ధ్వంసం చేశాడని వెల్లడించారు. శివయ్య అంటూ మొన్న భైరవం ఈవెంట్లో అన్నానని, ఆ తర్వాత అనకుండా ఉండాల్సింది అని బాధపడినట్లు చెప్పుకొచ్చారు.తన తండ్రి మోహన్బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని నటుడు మంచు మనోజ్ పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ.. "వెళ్లి నాన్న కాళ్లు పట్టుకోవాలని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే..? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా. ఇది మా నాన్న నేర్పించిన నీతి. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా." అని అన్నారు.
Latest News