|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 02:58 PM
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ బాబు. వీరిద్దరి కలయికలో రాబోతున్న భారీ చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.ఈ చిత్రంలో పృథ్వీరాజ్ 'కుంభ' అనే పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్లో ఆయన లుక్ అత్యంత క్రూరంగా, భయంకరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ చిత్రంలో మహేశ్ బాబుకు దీటైన ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ నటించనున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఫస్ట్ లుక్తోనే రాజమౌళి చెప్పకనే చెప్పారు.ఈ నెల 15న ఈ సినిమాకు సంబంధించి 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో ఓ భారీ ఈవెంట్ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్లో సినిమా టైటిల్ లేదా ఇతర వివరాలు వెల్లడిస్తారని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Latest News